ఓటు హక్కును వినియోగించుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి దంపతులు
ABN, First Publish Date - 2020-12-01T15:33:43+05:30
హైదరాబాద్: కుందం బాగ్లో డీజీపీ మహేందర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్: కుందం బాగ్లో డీజీపీ మహేందర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవడం తమ విధి అని పేర్కొన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2020-12-01T15:33:43+05:30 IST