తెలంగాణలో 14కు చేరిన మృతుల సంఖ్య
ABN, First Publish Date - 2020-04-12T18:29:07+05:30
నగరంలో కరోనా వైరస్తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మర్కజ్కు వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా అతనికి వైరస్ సోకింది. సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. ఈ రెండు మరణాలతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 14కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ల సంఖ్య 503కు చేరింది. అయితే సూర్యాపేట జిల్లాలో తొలుత మూడు కేసులేనని వెల్లడించగా శనివారం రాత్రి 11 గంటల సమయానికి 11 కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇవి కూడా కలిపితే కొత్తగా పాజిటీవ్ కేసుల సంఖ్య 24కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 393 పాజిటీవ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 51 మందిని డిశ్చార్జ్ చేశారు.
Updated Date - 2020-04-12T18:29:07+05:30 IST