ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రావణి ఆత్మహత్య కేసు : పోలీసులు నిగ్గు తేల్చిన నిజానిజాలివీ..

ABN, First Publish Date - 2020-09-14T22:17:57+05:30

‘మనసు మమత’, ‘మౌనరాగం’ వంటి సీరియళ్లతో పాపులర్‌ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ‘మనసు మమత’, ‘మౌనరాగం’ వంటి సీరియళ్లతో పాపులర్‌ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఈ ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణ పేర్లు వినిపించాయి. అంతేకాదు ఆ ఇద్దరూ కలిసి ‘ఆర్ఎక్స్-100’ సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. చివరకు దేవరాజ్, సాయినే నిందితులని పోలీసులు నిగ్గు తేల్చారు.


పరారీలో నిర్మాత..

ఇప్పటికే మూడ్రోజుల పాటు దేవరాజును.. ఒక్కరోజంతా సాయిని విచారించిన పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అనంతరం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియా మీట్ నిర్వహించి విచారణలో నిగ్గుతేల్చిన నిజానిజాలను వెల్లడించారు. ఈ కేసులో A-1సాయికృష్ణ, A-2 దేవరాజు అని డీసీపీ ఏఆర్‌ తెలిపారు. RX100 చిత్ర నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారన్నారు. ఇవాళ ఉదయం నుంచి అశోక్ రెడ్డి మొబైల్ పనిచేయట్లేదని పేర్కొన్నారు.


శ్రావణి పరిచయాలు ఇలా..

ఈ నెల 8న సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి 2012లో హైదరాబాద్‌కు వచ్చి టీవీ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. 2015లో సాయికృష్ణారెడ్డి, 2017లో నిర్మాత అశోక్‌రెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడింది. 2019లో దేవరాజుతో శ్రావణికి పరిచయం ఏర్పడింది. దేవరాజుకు శ్రావణి దగ్గరవుతుందని కుటుంబ సభ్యులకు సాయి చెప్పాడు. దేవరాజుతో శ్రావణి స్నేహంగా ఉండటం సాయికి నచ్చలేదు. దేవరాజుతో పరిచయం తర్వాత గొడవలు పెరిగాయి. దీంతో శ్రావణిని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారు. దేవరాజు కూడా పెళ్లి పేరుతో శ్రావణిని మోసం చేశాడు. దేవరాజును పెళ్లి చేసుకుంటుందని శ్రావణిపై తల్లిదండ్రులు, సాయి దాడి చేశారు. గతంలో పంజాగుట్ట పీఎస్‌లో దేవరాజురెడ్డిపై శ్రావణి ఫిర్యాదు చేసింది. సాయి కూడా బెదిరింపులకు దిగే వాడని విచారణలో తేలిందిఅని డీసీపీ మీడియాకు వెల్లడించారు.


ముగ్గురూ మాటిచ్చారు..!

ఆత్మహత్యకు ముందు దేవరాజుతో శ్రావణి ఫోన్‌లో మాట్లాడింది. ఈ కేసులో శ్రావణి కుటుంబ సభ్యులెవర్నీ నిందితులుగా చూడటం లేదు. శ్రావణి బాగుకోసమే ఆమె కుటుంబ సభ్యులు కొంత ఒత్తిడి తెచ్చారు. నిందితులు ముగ్గురూ శ్రావణిని పెళ్లి చేసుకుంటామని మాటిచ్చారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా శ్రావణి ఆత్మహత్యకు ముగ్గురూ కారకులే. ఇలా అందరూ కలిసి వేధించడం వల్లే శ్రావణికి మనస్తాపానికి గురైంది అని శ్రీనివాస్‌ మీడియాకు వివరించారు.



Updated Date - 2020-09-14T22:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising