ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌నేషన్‌కు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి- సీఎస్‌

ABN, First Publish Date - 2020-12-03T23:59:59+05:30

కోవిడ్‌-19 మొదటి దశ వ్యాక్సినేషన్‌ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కోవిడ్‌-19 మొదటి దశ వ్యాక్సినేషన్‌ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అయిన ఆరోగ్యకార్యకర్తలు, పోలీసుసిబ్బంది, శానిటేషన్‌ సిబ్బందితో కూడి డేటా బేస్‌ తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి స్టీరింగ్‌కమిటీ మొదటి సమావేశం గురువారం జరిగింది. 


ఈసందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై కమిటీ చర్చించింది. ఈసందర్భంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కోల్డ్‌ఛైన్‌ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బందికి శిక్షణ, లాజిస్టిక్‌ఏర్పాట్లు, ఇఇసి ప్రచారం, వైద్య సౌకర్యాల మ్యాపింగ్‌ తదితర అంశాలపై సీఎస్‌ సమీక్షించారు. వ్యాక్సినేషన్‌ సెంటర్ల నిర్వహణకు అవసరమైన ప్రోటోకాల్‌ను తయారు చేయాలని ఆదేశించారు. 


ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, అడిషనల్‌ డీజీ జితేందర్‌, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌, వైద్య ఆరోగ్యశాఖ్‌ కార్యదర్శి రిజ్వీ, హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జ, పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా, మైనార్టీ కార్యదర్శి అహ్మద్‌నదీం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T23:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising