ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: చాడ
ABN, First Publish Date - 2020-09-24T09:21:54+05:30
ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: చాడ
సరూర్నగర్ చెరువు పరిసరాల్లో వరదనీరు సాఫీగా ప్రవహించకుండా ఖాళీ స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్కు బుధవారం ఒక లేఖ రాశారు. చెరువుల్లోకి వరద నీరు ప్రవహించేవిధంగా వరద కాలువలను అభివృద్ధి చేయాలని కోరారు. ఇటీవల వరదలకు బలైన నవీన్ కుమార్ కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలన్నారు.
Updated Date - 2020-09-24T09:21:54+05:30 IST