కరోనాపై సీఎం సమీక్ష చేయకపోవడం బాధ్యతారాహిత్యమే: చాడ
ABN, First Publish Date - 2020-08-08T18:53:25+05:30
ప్రగతి భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తోన్న వారిని అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తోన్న వారిని అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం సీపీఐ కార్యాలయంలో విపక్షాలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరోనా టెస్టులు చేయకపోవటంపై జాతీయస్థాయి చర్చ జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ లేదని విమర్శించారు. కరోనాపై ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయకపోవటం బాధ్యతారాహిత్యమని చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-08-08T18:53:25+05:30 IST