తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం
ABN, First Publish Date - 2020-08-14T15:55:52+05:30
తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. పోలీస్ విభాగంలో మొత్తం 4,252 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవగా... 39 మంది కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడటంతో పోలీసు విభాగంలో ఆందోళన నెలకొంది.
Updated Date - 2020-08-14T15:55:52+05:30 IST