ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

388 కరోనా కేసులు మర్కజ్‌ వెళ్లొచ్చినవారే: మంత్రి ఈటల

ABN, First Publish Date - 2020-04-10T00:38:27+05:30

తెలంగాణలో ఇప్పటి వరకు 471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 471 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వాళ్లలో 388 మంది మర్కజ్‌ వెళ్లొచ్చినవారే అని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ 665 శాంపిల్స్‌ టెస్ట్‌ చేస్తే 18 పాజిటివ్‌ వచ్చాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందారని ఈటల పేర్కొన్నారు. 45 మంది ఇప్పటికే డిశ్చార్జ్‌ అయ్యారని, 414 మందికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. రాత్రికి మరికొన్ని టెస్టులు రావాల్సి ఉందని, శుక్రవారం 70 మంది వరకు డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కేవలం ఒక్కరికే వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఈ నెల 22 నాటికి అందరూ డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మర్కజ్‌ ఘటన లేకుంటే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రం అయ్యేదని ఈటల వెల్లడించారు. గతంలోలా వేల సంఖ్యలో శాంపిల్స్‌ వచ్చే అవకాశం లేదని ఈటల తెలిపారు.

Updated Date - 2020-04-10T00:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising