ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం

ABN, First Publish Date - 2020-11-29T18:50:44+05:30

జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా పెరుగుతున్న పాజిటీవ్ కేసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. తాజాగా పెరుగుతున్న పాజిటీవ్ కేసులు జిల్లా వాసుల్లో భయాందోళన రేపుతోంది. కోరుట్ల సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో 75 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. కోరుట్లలోని  అల్లమయ్య గుట్టలో ఉన్న డిగ్రీ కాలేజీ మొదటి ఏడాది విద్యార్థులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో మొత్తం 295 మంది విద్యార్థులకు పరీక్షలు చేశారు. 67 మంది విద్యార్థులు సహా 7గురు లెక్చరర్లు, వంట మనిషికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో విద్యార్థులను కాలేజీలో క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. నెగిటివ్ వచ్చిన విద్యార్థులను ఇళ్లకు పంపించనున్నారు. 


విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓ వివాహానికి హాజరైన 30 మందికి కరోనా సోకడంతో జగిత్యాల జిల్లాలో కలకలం రేగింది. తాజాగా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు వైరస్ సోకడంతో జిల్లా వ్యాప్తంగా భయాందోళన నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-11-29T18:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising