సోషల్ మీడియా పోస్టింగ్లపై నిరంతర నిఘా
ABN, First Publish Date - 2020-08-13T08:03:55+05:30
సోషల్ మీడియాలో చేసే పోస్టింగ్లపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని డీజీపీ మహేందర్
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే కఠిన చర్యలు
- డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో చేసే పోస్టింగ్లపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా పోస్టింగ్లు పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్ట్తోనే బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆ తరహాలో వ్యవహరించే వారిపై చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టింగ్లు పెట్టే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహేందర్ రెడ్డి కోరారు.
Updated Date - 2020-08-13T08:03:55+05:30 IST