రేపు విద్యుత్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు
ABN, First Publish Date - 2020-07-06T00:40:32+05:30
ఆదివారం తెలంగాణలోని విద్యుత్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. పేద ప్రజలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు..
హైదరాబాద్: ఆదివారం తెలంగాణలోని విద్యుత్ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. పేద ప్రజలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు.. లాక్డౌన్ కాలానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేపు ఉదయం గాంధీభవన్ నుంచి విద్యుత్ సౌధ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.
Updated Date - 2020-07-06T00:40:32+05:30 IST