ఎన్ఆర్ఐ ఆస్తుల నమోదుకు త్వరలో మార్గదర్శకాలు
ABN, First Publish Date - 2020-10-18T10:08:30+05:30
ఎన్ఆర్ఐ ఆస్తుల నమోదుకు త్వరలో మార్గదర్శకాలు
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), విదేశీయులు, ఓవర్సీస్ సిటీజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగిన వారి ఆస్తుల నమోదు కోసం త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. వ్యవసాయేతర ఆస్తుల (ఇళ్లు, ప్లాట్లు/వాణిజ్య స్థలాలు) నమోదును యాజమానుల రక్షణ కోసమే చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారంనాటికి 24వేల మంది అధికారులు 75.74 లక్షల ఆస్తుల నమోదు పూర్తి చేశారని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తులను యాజమానులే నేరుగా వెబ్సైట్ ద్వారా లేదా మీ-సేవలో ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆస్తిపై రక్షణతో కూడిన హక్కుల కోసం మొబైల్ నంబర్ను, మెరూన్ కలర్ వ్యవసాయేతర పాస్బుక్ కోసం యజమాని ఫొటో సేకరిస్తున్నామని వివరించారు.
Updated Date - 2020-10-18T10:08:30+05:30 IST