మిడతల దండును ఎదుర్కొనేందుకు సిద్ధం: కలెక్టర్ అజీమ్
ABN, First Publish Date - 2020-05-29T18:57:28+05:30
జయశంకర్ భూపాలపల్లి: మిడతల దండు ఇక్కడికి వస్తే ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అబ్దుల్ అజీమ్ తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి: మిడతల దండు ఇక్కడికి వస్తే ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. మిడతల దండు మహరాష్ట్ర మీదుగా తెలంగాణ జిల్లాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల జిల్లా తర్వాత భూపాలపల్లి జిల్లాలో కూడా మిడతల దండు ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఏర్పాట్లు చేశామన్నారు. రసాయనాలు స్ర్పే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. పంట చేలల్లో ఉన్న రైతులు ముందే రసాయనాలు స్ర్పే చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Updated Date - 2020-05-29T18:57:28+05:30 IST