సీఎం కేసీఆర్కు విరాళాలు అందించిన ప్రముఖులు
ABN, First Publish Date - 2020-04-11T01:10:39+05:30
కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగ పడేందుకు పలువురు ప్రముఖులు శుక్రవారం భారీగా విరాళాలు అందించారు.
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగ పడేందుకు పలువురు ప్రముఖులు శుక్రవారం భారీగా విరాళాలు అందించారు. ఈసందర్భంగా గంగవరం పోర్టు లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్నిఅందించారు. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఛైర్మన్ డివిఎస్ రాజు ప్రతిగతి భవన్లో సీఎం కేసీఆర్కు అందించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సంస్థ ఛైర్మన్ కుమారుడు రాజేశ్రాజ్, డిటీనాయక్ పాల్గొన్నారు. ఇక మైహోమ్స్ గ్రూప్అధినేత జూపల్లి రాజేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయ నిధికి 3కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును మైహోమ్స్ గ్రూప్డైరెక్టర్లు జూపల్లి రామారావు, జూపల్లిశ్యామ్రావు ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశారు.
Updated Date - 2020-04-11T01:10:39+05:30 IST