సున్నం రాజయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ABN, First Publish Date - 2020-08-04T16:17:01+05:30
సున్నం రాజయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేశారన్నారు. అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Updated Date - 2020-08-04T16:17:01+05:30 IST