ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌పై అక్బర్ ప్రశంసల జల్లు

ABN, First Publish Date - 2020-03-16T18:15:32+05:30

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యానించారు. సీఏఏ కేవలం ముస్లింలకే కాదని... దేశంలోని పేదలందరికీ వ్యతిరేకమన్నారు. తాను ఈ దేశవాసినని.. దేశం కోసం ప్రాణమివ్వడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేక తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.  సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానం దేశానికి ఆదర్శమన్నారు. సీఎం కేసీఆర్ ప్రయత్నాన్ని అభినందించారు. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మాణం చేసిన ఎనిమిదో రాష్ట్రం తెలంగాణ అన్న ఆయన.. ఓ గొప్ప సందేశాన్ని ఇక్కడి నుంచి దేశమంతా తీసుకెళుతున్నారు. తెలంగాణలో అందరినీ ఒకేలా చూస్తారని.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానంతో తమ హృదయాలు పులకిస్తున్నాయన్నారు. అందరినీ కలుపుకుపోయే వ్యక్తి కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌కు తామెందుకు మద్దతు పలుకుతున్నామో.. ఇవాళ అందరికీ తెలుస్తుందన్నారు. ఎవరైనా సరే.. అందరూ ఈ నేలపై ఒక్కటేనన్నారు.  

Updated Date - 2020-03-16T18:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising