ఎక్సైజ్లో పదోన్నతులకు లైన్ క్లియర్
ABN, First Publish Date - 2020-12-30T07:41:59+05:30
ఎక్సైజ్ శాఖలో ఉన్నత స్థాయి పోస్టుల పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. సీనియారిటీ జాబితాను తయారు చేసి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశాన్ని నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో ఉన్నత స్థాయి పోస్టుల పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది. సీనియారిటీ జాబితాను తయారు చేసి, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశాన్ని నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్లను ఆదేశించారు. సీఎస్, ఎక్సైజ్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు మంత్రి సూచించారు. ఎక్సైజ్శాఖలో ఉన్నత స్థాయిలో ప్రస్తుతం 72 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తేల్చారు.
Updated Date - 2020-12-30T07:41:59+05:30 IST