ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

ABN, First Publish Date - 2020-06-23T21:49:59+05:30

చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేశారు. ఈ సందర్భంగా పూజారి రంగరాజన్ మాట్లాడుతూ  అహోబిలం లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలో ఉండే అర్చకస్వామికి కరోనా పాజిటీవ్ వచ్చిందని, దీంతో అధికారులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దేవాలయం మూసివేయాలని నిర్ణయించారని... అర్చకుడు సమాజహితం కోసం పనిచేపేవాడని, భక్తులకు దర్శనం చేయించే క్రమంలో అతనికి కరోనా వచ్చిందన్న విషయం భక్తులు గమనించాలన్నారు. 


కొన్ని మీడియా చానళ్లలో అర్చకుడికి కరోనా విషయాన్ని హేళనగా చూపించారని రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషికి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయన్నారు. మాస్కులు, సామాజిక దూరం పాటించినా కొంతమందికి కరోనా వచ్చే అవకాశం ఉందని రంగరాజన్ అన్నారు. కరోనా అనేది వ్యాధి అని.. అందుచేత అర్చకుడిని హేళన చేయవద్దని ఆయన కోరారు. చిలుకూరు ఆలయం మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగవంతుని దర్శనం కొన్ని రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉండదని రంగరాజన్ తెలిపారు.


Updated Date - 2020-06-23T21:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising