చర్ల ఎన్కౌంటర్పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు
ABN, First Publish Date - 2020-09-24T17:41:37+05:30
భద్రాద్రి కొత్తగూడెం చర్ల ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరిపించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం చర్ల ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరిపించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం ఈ లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసింది. ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ కోరారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కేసు నమోదు చేయాలన్నారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని.. మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. లంచ్ మోషన్ విచారణకు హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం 2:30 గంటలకు పిటీషన్పై విచారణ జరుగనుంది.
Updated Date - 2020-09-24T17:41:37+05:30 IST