రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదు: జగదీశ్ రెడ్డి
ABN, First Publish Date - 2020-09-25T08:43:48+05:30
ఆరేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు...
మర్రిగూడ, సెప్టెంబరు 24: ఆరేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలను దోచుకుని, పెట్టుబడిదారుల ఖజానా నింపేలా ఉన్నాయని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రజలే వారిని కొడతారని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్రం చేసిన కృషిని చూసే, కేంద్ర ప్రభుత్వం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిందని పేర్కొన్నారు.
Updated Date - 2020-09-25T08:43:48+05:30 IST