గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్పై కేసు నమోదు
ABN, First Publish Date - 2020-07-07T08:07:12+05:30
గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ-5 చానల్ యాజమాన్య హక్కులు చేతులు మారనున్నాయని వెబ్సైట్లో ఓ కథనం వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ చానల్ను
బంజారాహిల్స్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గ్రేట్ ఆంధ్రా డాట్ కామ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ-5 చానల్ యాజమాన్య హక్కులు చేతులు మారనున్నాయని వెబ్సైట్లో ఓ కథనం వచ్చింది. హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ చానల్ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపించిందని.. అది బెడిసి కొట్టిందని ఆ కథనంలో పేర్కొంది. దీంతో దుబాయ్ వ్యాపారులు కొనుగోలుకు సిద్థమవుతున్నారని వివరించింది. ఆ వివరాలన్నీ అవాస్తవాలని, ఆ కథనం తమ చానల్ పరువు తీసేలా ఉందని పేర్కొంటూ టీవీ-5 ఎండీ రవీంధ్రనాథ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-07-07T08:07:12+05:30 IST