ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు చేయరేం?

ABN, First Publish Date - 2020-11-29T06:17:03+05:30

‘ధాన్యం కొనుగోలు చేయండి.. మహాప్రభో..’ అంటూ రైతన్నలు రోడ్డెక్కారు. పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఈ ఆందోళనలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డెక్కిన రైతన్నలు.. పలు జిల్లాల్లో ఆందోళనలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

‘ధాన్యం కొనుగోలు చేయండి.. మహాప్రభో..’ అంటూ రైతన్నలు రోడ్డెక్కారు. పలు జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఈ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ధాన్యం కొనుగోలు చేసినా తరలింపులో జాప్యం జరుగుతుండటంపై జనగామ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో ధాన్యాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగేశ్వర శర్మ, మార్కెట్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి జీవన్‌ కుమార్‌ రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప జేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండల రైతులు రోడ్డెక్కారు. శనివారం 44వ నెంబరు జాతీయ రహదారిపై మూసాపేట దగ్గర రాస్తారోకో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు తమను ముంచుతోందంటూ రైతులు వాపోయారు.

Updated Date - 2020-11-29T06:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising