‘గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 80 డివిజన్లు గెలుస్తుంది’
ABN, First Publish Date - 2020-10-01T18:44:01+05:30
‘గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 80 డివిజన్లు గెలుస్తుంది’
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 80 డివిజన్లు గెలుస్తోందని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. మేయర్ పీఠం బీజేపీదేనని సర్వేలు చెప్తున్నాయని తెలిపారు. గతంలో గెలిచిన ఏఒక్క కార్పోరేటర్ మీద ప్రజలకు సధాభిప్రాయం లేదన్నారు. హైదరాబాద్కు టీఆర్ఎస్ చేసిందేంటో స్పష్టం చేయాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో రూ.60 వేల కోట్లు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. చిన్న వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతోందన్నారు. మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Updated Date - 2020-10-01T18:44:01+05:30 IST