ప్రజలు క్షమించరు: భట్టి
ABN, First Publish Date - 2020-07-08T09:32:39+05:30
ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్రంలోని సంపదను ధ్వంసం చేస్తే సీఎం కేసీఆర్ను ప్రజలు క్షమించరని సీఎల్పీ నేత మల్లు ...
మధిర టౌన్, జూలై 7: ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్రంలోని సంపదను ధ్వంసం చేస్తే సీఎం కేసీఆర్ను ప్రజలు క్షమించరని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. రహస్యంగా భవనాన్ని అర్ధరాత్రి కూలగొట్టడం వెనుక కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే లక్ష్యం ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.
Updated Date - 2020-07-08T09:32:39+05:30 IST