భద్రాచలం ఆలయ పరిరక్షణకు ప్రధానికి పొంగులేటి వినతి
ABN, First Publish Date - 2020-08-13T07:51:25+05:30
భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయం పరిరక్షణకు కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ, సాంస్కృతిక శాఖల చేత అధ్యయనం చేయించేలా
భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయం పరిరక్షణకు కేంద్ర జలశక్తి, పర్యావరణ, అటవీ, సాంస్కృతిక శాఖల చేత అధ్యయనం చేయించేలా ఆదేశాలివ్వాలని ప్రధాని మోదీని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. పోలవరం బ్యాక్వాటర్ కారణంగా భద్రాచలంతో పాటు ఆలయ భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఓ లేఖలో కోరారు.
వేతన బకాయిలు చెల్లించాలి: బీజేపీ
ఉద్యోగులు, పెన్షనర్లకు నిలిపివేసిన మూడు నెలల వేతన బకాయిలను చెల్లించాలని బీజేపీ రిటైర్డు ఎంప్లాయిస్ సెల్ చైర్మన్ బి. మోహన్రెడ్డి, కో-చైర్మన్లు పి.వెంకటరెడ్డి, పి.సరోత్తంరెడ్డిలు ప్రభుత్వాన్ని కోరారు.
Updated Date - 2020-08-13T07:51:25+05:30 IST