ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లంచం ఇవ్వడం కోసం భిక్షాటన

ABN, First Publish Date - 2020-12-27T07:17:59+05:30

మంచిర్యాల జిల్లా తాండూర్‌ గ్రామానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్‌ అనే యువరైతు భూమి విషయంలో తనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూమి సమస్య పరిష్కరించని అధికారులపై యువరైతు పోరాటం


తాండూర్‌(బెల్లంపల్లి), డిసెంబరు 26: మంచిర్యాల జిల్లా తాండూర్‌ గ్రామానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్‌ అనే యువరైతు భూమి విషయంలో తనకు అన్యాయం జరుగుతున్నా  రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ శనివారం ఐబీ చౌరస్తాలో భిక్షాటన చేశారు. అనంతరం నిరాహార దీక్ష చేపట్టారు.  తాండూర్‌ శివారులోని 612/అ/5, 612/5/అ సర్వే నెంబర్లలో 8 ఎకరాల భూమి కొనుగోలుచేసి పదేళ్ళుగా సాగు చేస్తున్నట్లు ప్రసాద్‌ తెలిపారు. భూమికి సంబంధించి అన్ని పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయన్నారు.  కొందరు కబ్జాదారులు బెదిరిస్తున్నారని వాపోయారు. తన భూమికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో  లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.


ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, అధికారులకు లంచం కొరకు భిక్షాటన చేస్తున్నానని చెప్పారు.  తహశీల్దార్‌ కవితను వివరణ కోరగా రాజేంద్రప్రసాద్‌కు సంబంధించిన భూమి వివాదంలో ఉందని, విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందించామన్నారు.  వివాదంలో ఉన్న భూములు ధరణి వెబ్‌సైట్‌లో కేటగిరి పార్టు బిలో ఉండడంతో సమస్యను పరిష్కరించలేక పోతున్నామని చెప్పారు. 


Updated Date - 2020-12-27T07:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising