నీటి పారుదల నిపుణులతో బండి సంజయ్ సమావేశం
ABN, First Publish Date - 2020-06-01T16:52:59+05:30
హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో కృష్ణానది నీటి వినియోగంపై నీటిపారుదల నిపుణులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో కృష్ణానది నీటి వినియోగంపై నీటిపారుదల నిపుణులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి కిషన్రెడ్డి కూడా పాల్గొననున్నారు. కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన వాటా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు.
299 టీఎంసీల నీటిలో ఇప్పటివరకు తెలంగాణ కోసం పూర్తిస్థాయిలో వినియోగించబడలేదు. అలాగే పాలమూరు, రంగారెడ్డిలో 2టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించడంపై చర్చ జరగనుంది. నీటి వాటాలో విషయంలో ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాలపై నిపుణులతో చర్చించనున్నారు. కృష్ణానది నీటి వినియోగంపై బీజేపీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించనుంది.
Updated Date - 2020-06-01T16:52:59+05:30 IST