‘కుమరం భీమ్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది’
ABN, First Publish Date - 2020-08-09T16:56:22+05:30
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన ఉద్యమకారుడు కుమరం భీమ్ ఆశయాలకు
హైదరాబాద్ : నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన ఉద్యమకారుడు కుమరం భీమ్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోందని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్పై కుమరం భీమ్ విగ్రహానికి బండి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, రామచంద్రరావుతో పాటు గిరిజన మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి.. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఆదివాసీలు సాగు చేసుకొనే పోడు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు.
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని బండి విమర్శించారు. 12శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. ఎంపీ సోయం మాట్లాడుతూ.. ఆదివాసీల ఓట్ల కోసం కేసీఆర్ గిరిజన రిజిస్ట్రేషన్లను వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోవో నంబర్-03 ప్రకారం గిరిజన ప్రాంతాల్ల్లో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసీలకే దక్కాలన్నారు. పోడు భూములు గిరిజనులకే దక్కాలని ఆదిలాబాద్ ఎంపీ డిమాండ్ చేశారు.
Updated Date - 2020-08-09T16:56:22+05:30 IST