ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదాపూర్‌లో హిజ్రాపై పెట్రోలు పోసి నిప్పంటించిన మరో వర్గం!

ABN, First Publish Date - 2020-10-13T02:02:03+05:30

హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రెండు హిజ్రా వర్గాల మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో జరిగిన ఈ గొడవ కాస్త పెట్రోలు పోసి తగలబెట్టుకునే స్థితికి వెళ్లింది. మాదాపూర్ పీఎస్ పరిధిలో ఓ హిజ్రాపై మరో హిజ్రా వర్గం పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర సంచలనమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


అసలేం జరిగింది..!?

పూర్తి వివరాల్లోకెళితే.. ఎర్రగడ్డ అవంతి నగర్‌కు చెందిన హరి ప్రసాద్ అలియాస్ హంస (28)కు ఇటీవల చందానగర్‌లో నివాసం ఉంటున్న కొంతమంది హిజ్రాలతో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హైటెక్ రైల్వే‌ స్టేషన్ సమీపంలో మాట్లాడుకుందామని హంసకు సమాచారం అందించారు. ఈ గొడవకు ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేయాలని భావించిన హంస పిలవగానే రైల్వే స్టేషన్‌ దగ్గరికెళ్లింది. హంస ఒక్కటే రావడంతో అటువైపున్న మరో వర్గం వారు ఆమెను పట్టుకుని పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటనలో హంసకు తీవ్రగాయాలయ్యాయి.


మంటల్లో కాలుతున్న హంసను గమనించిన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ హంస ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలోనే హంస చికిత్స పొందుతోంది. హంస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-13T02:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising