ఆదిలాబాద్ జిల్లాలో మరో 7పాజిటివ్ కేసులు
ABN, First Publish Date - 2020-07-12T00:46:44+05:30
కరోనా వైరస్ జిల్లా వాసులను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నది. జిల్లాలో రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. శనివారం 7పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆదిలాబాద్: కరోనా వైరస్ జిల్లా వాసులను తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నది. జిల్లాలో రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నది. శనివారం 7పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో 9 మంది ఉన్నారు. పట్టణంలోని శ్రీనివాస థియేటర్ ఏరియాలో ముగ్గురు, అవోపా కాలనీ, హమా లివాడ, ఎన్టీఆర్నగర్, తిలక్నగర్, పాత మంచిర్యాల, జన్మభూమినగర్లో ఒక్కో కేసు నమోదైంది. మిగతా 8 కేసులు ఆయా మండలాల్లో నమోదయ్యాయి. కరోనా వంటి విపత్కర సమయంలో మరో ప్రమాదం అటు ప్రజలను, ఇటు అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తోంది. జిల్లాలో అడపాదడపా వర్షాలు మొదలయ్యాయి. దీంతో జ్వరాల సీజన్ కూడా ప్రారంభమైంది. ఏటా జూలై నెలాఖరు నుంచి నవంబరు వరకు జిల్లాలో జ్వరాల తీవ్రత విపరీతంగా ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి.
Updated Date - 2020-07-12T00:46:44+05:30 IST