ఆస్పత్రుల్లో కార్మికులకు అలవెన్సులివ్వాలి: చాడ
ABN, First Publish Date - 2020-08-11T09:13:39+05:30
ఆస్పత్రుల్లో కార్మికులకు అలవెన్సులివ్వాలి: చాడ
హైదరాబాద్, ఆగస్టు 10 ( ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు సీఎం ప్రకటించిన 10శాతం ఇన్సెంటివ్, రిస్క్ అలవెన్స్ వెంటనే చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. నర్సింగ్, పారామెడికల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈమేరకు ఆయన మంత్రి ఈటల రాజేందర్కు సోమవారం లేఖ రాశారు. తార్నకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో కరోనా బారినపడిన ఆర్టీసీ కార్మికుల కోసం వంద పడకలతో ప్రత్యేక ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు.
Updated Date - 2020-08-11T09:13:39+05:30 IST