ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగ్గుతున్న నీరు

ABN, First Publish Date - 2020-05-27T10:32:06+05:30

ఎల్లంపల్లి జలాశయంలో నీరు అడుగంటుతుందని, స్థానిక అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థానిక అవసరాలు తీరిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌


హాజీపూర్‌, మే 26 : ఎల్లంపల్లి జలాశయంలో నీరు అడుగంటుతుందని, స్థానిక అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు. మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు ను సందర్శించిన అనంతరం మాట్లాడారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, దీని వల్ల నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు.  నీరు లేక చేపలు మృతి చెందుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎల్లంపల్లి జలాశయంలోకి ఎన్ని టీఎంసీల నీటిని నింపారో ప్రజలకు తెలపాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో  జల జాతర పేరిట సంబరాలు చేశారని,  ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీటిని తీసుకెళ్తున్నారని, ఇక్కడ ఉన్న ప్రజలకు సరిపడా తాగునీరు లభించడం లేద న్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, గోపతి మల్లేష్‌, మాధవరపు రమణరావు, తులా మధుసూదన్‌, మల్లికార్జున్‌,  ఎనగంటి నరేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising