ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లర్ల బాధితులకు బాసటగా నిలుస్తాం

ABN, First Publish Date - 2020-03-02T12:35:09+05:30

సంక్రాంతి పర్వదిన సమీపంలో భైం సా పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల కష్ట, నష్టాలపాలైన బాధిత కుటుంబాలకు సంఘం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా, మార్చి1: సంక్రాంతి పర్వదిన సమీపంలో భైం సా పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల కష్ట, నష్టాలపాలైన బాధిత కుటుంబాలకు సంఘం తరపున అవసరమైన సహాయ, సహాకారాలు అందించి బాసటగా నిలుస్తామని మున్నురుకాపు సంఘం నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాజయ్య వెల్లడించారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా మున్నురుకాపు సంఘం ప్రతినిధులతో కలిసి భైంసా లో పర్యటించి బాఽధితులను పరామర్శించారు. అల్లరిమూక లు జరిపిన దాడిలో దహనమైన, ద్వంసమైన, దెబ్బతిన్న నివాస గృహాలను పరిశీలించారు.


అనంతరం ఏర్పాటు చే సిన సమావేశంలో  మున్నురుకాపు నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాజయ్య మాట్లాడుతూ జిల్లా అధ్య క్షుడు డి.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు సంఘం ప్రతినిధుల బృందం భైంసాలో పర్యటించడం జరిగిందన్నారు. ఇక్కడి పరిస్థితులు, బాధితుల స్థితి,గతులను జిల్లా సంఘానికి ని వేదిస్తామన్నారు. త్వరలోనే జిల్లా అధ్యక్షడు డి.శ్రీనివాస్‌ సారఽథ్యంలోని మున్నురుకాపు సంఘం నిజామాబాద్‌ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో బాధితులకు సహాయ, సహ కారాలు అందించి వారికి అన్ని విధాలుగా చేదోడు, వాదో డుగా నిలుస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘ నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధులు బాలవర్ధి, ఆకుల రాజే శ్వర్‌, రామర్తి గంగాధర్‌, శరత్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2020-03-02T12:35:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising