ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి గిరిజనుల పూజలు

ABN, First Publish Date - 2020-03-23T10:34:52+05:30

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తుడుం మోగించారు. తమ సాంప్రదాయం ప్రకారం గ్రామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, మార్చి 22: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తుడుం మోగించారు. తమ సాంప్రదాయం ప్రకారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి తమ గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ప్రతీఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అదే విధంగా తమ సాంప్రదాయ నృత్యమైన డోలు డేంసాతో తుడుం మోగించి కరోనా కట్టడికి ప్రతీఒక్కరు కట్టుబడి ఉండాలని కోరారు.


ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లోనూ తమ కులదేవతల ఆలయాల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదే విధంగా కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా స్వీయ నిర్భందంలోనే గడిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం మారుమూల గ్రామమైన కొండపైనుండే రత్నాపూర్‌ గ్రామంలో గిరిజనులు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. 

Updated Date - 2020-03-23T10:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising