ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం

ABN, First Publish Date - 2020-09-27T12:36:14+05:30

సబ్బండ వర్గాలను ఐక్యం చేసి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా పని చేస్తామని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిటౌన్‌, సెప్టెంబరు 26: సబ్బండ వర్గాలను ఐక్యం చేసి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా పని చేస్తామని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇటీవల ప్రారంభించిన మహాజన ఐక్య యాత్ర ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పూర్తి చేసుకుని శనివారం మందమర్రి చేరుకున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  95 శాతం ఉన్న సబ్బండ వర్గాలకు పరిపాలించే హక్కు లేకుండా పోయిందని చెప్పారు. కేవలం 5 శాతం ఉన్న వర్గాలు పాలిస్తున్నాయని తెలిపారు.  సామాజిక తెలంగాణ విధానాన్ని ముందుకు నడిపే ఏకైక శక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. సామాజిక తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటానికి ప్రజాస్వామ్యవాదులు, వివక్షతకు గురైన వారు, కుల, మహిళ, విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్యనారాయణ, కేశవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T12:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising