ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాహితమే పోలీసుల ధ్యేయం

ABN, First Publish Date - 2020-12-05T03:52:14+05:30

ప్రజాహితమే పోలీసుల ధ్యేయమని ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు అన్నారు.

తిర్యాణిలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు

తిర్యాణి, డిసెంబరు4: ప్రజాహితమే పోలీసుల ధ్యేయమని ఆసిఫాబాద్‌ డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు అన్నారు. తిర్యాణి మండలంలోని పలు ఆదివాసీ గ్రామాల్లో శుక్రవారం ఆసిఫాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో వసుధ సంస్థ సహకారంతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఓ పక్క శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతూనే మరో పక్క సామాజిక కార్యక్రమాలను నిర్వహి స్తున్నారన్నారు. పోలీసులు ప్రజల నేస్తాలని, కేవలం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపైనే తమ చర్యలు ఉంటాయని డీఎస్పీ పేర్కొన్నారు. ఎవరు కూడా పోలీసులంటే ఏవో లేనిపోని అపోహలు పెట్టుకుని భయ పడవద్దన్నారు. ఈసందర్భంగా 250 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సీఐ సతీష్‌కుమార్‌, ఎస్సై రామారావు, ఎంపీపీ శ్రీదేవి, సర్పంచ్‌లు అర్చన, జంగుబాయి, బాదిరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-05T03:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising