తెలంగాణలోని బాసరకు చేరుకున్న పాకిస్తాన్ రిటర్నీ గీత
ABN, First Publish Date - 2020-12-16T00:00:22+05:30
పాకిస్తాన్ రిటర్నీ గీత కుటుంబ సభ్యుల కోసం వెతుకుతూ తెలంగాణలోని బాసరకు చేరుకుంది. 20 ఏళ్ల కిందట తప్పిపోయి...
నిర్మల్: పాకిస్తాన్ రిటర్నీ గీత కుటుంబ సభ్యుల కోసం వెతుకుతూ తెలంగాణలోని బాసరకు చేరుకుంది. 20 ఏళ్ల కిందట తప్పిపోయి పాకిస్తాన్కు వెళ్లిన గీత.. 5 ఏళ్ల క్రితం సుష్మాస్వరాజ్ చొరవతో ఇండియాకు చేరుకున్న సంగతి తెలిసిందే. గీత ఇచ్చిన సమాచారం ఆధారంగా కొన్నాళ్లుగా ఆమె తల్లిదండ్రుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ వెతుకులాట మొదలుపెట్టింది. చిన్నతనంలో తమ ఊర్లో వరి పంట, ఇడ్లీ చేసేవారని గీత చెప్పింది. దీంతో.. వరి, ఇడ్లీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే వాడుతుండటంతో గీతను తీసుకుని ఆ స్వచ్ఛంద సంస్థ బాసరకు చేరుకుంది. ఏడేళ్ల వయసులో తెలియక పొరపాటున భారత సరిహద్దు దాటిన బదిర యువతి గీత దాదాపు పదేళ్ల పాటు పాకిస్తాన్లోనే ఉంది. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో ఆమె స్వదేశమైన భారత్కు చేరుకుంది.
Updated Date - 2020-12-16T00:00:22+05:30 IST