గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN, First Publish Date - 2020-08-09T07:14:39+05:30
పారిశుధ్యంపై ప్ర త్యేక ప్రణాళిక రూపొందించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, అందుకు ..
- కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల కలెక్టరేట్ ఆగస్టు 8: పారిశుధ్యంపై ప్ర త్యేక ప్రణాళిక రూపొందించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, అందుకు అన్ని శాఖల అధికా రులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్ కుమార్ దీపక్, డీఆర్డీఏ శేషా ద్రిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవో, అధికారులు, సర్పంచులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ గం ధగీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బం దీగా నిర్వహించాలన్నారు. ప్రత్యేక పారిశుధ్య ప్రణాళి క ద్వారా గ్రామాలలో కార్యక్రమాలు చేపట్టాలని, సర్పంచులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండా లన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డర్టీ ఫ్రీ ఇం డియా కార్యక్రమం నిర్వహణపై వివరించారు. 9న ఆదివారం ప్లాస్టిక్ను వేరు చేసే కార్యక్రమం, 10న స్వచ్ఛ శ్రమదానం, 12న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా గ్రామాలలో హాబిటేషన్ పార్క్ ఏర్పాటు ఉండే లా చర్యలు తీసుకోవాలన్నారు. 13న నా గ్రామం- ము రికి రహితం అంశంపై 6,7వ తరగతులకు చిత్ర లేఖనం, 9,10వ తరగ తుల వారికి ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించాలని పేర్కొ న్నారు. 14న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారి శుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు ఈనెల 15 లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. డీఎల్పీవోలు ఫణిం దర్, ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు.
వీధి వ్యాపారులకు 10వేల రుణ సదుపాయం
ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధిలో భాగంగా అర్హులైన వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణ సదుపాయం కల్పించడం జరుగు తోందని కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని మార్కెల్ ఏరియాలో పర్యటించి పలువురు విక్ర యదారులను కలిసి ఆత్మనిర్భర్ నిధి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రుణం పొందిన వారు సకా లంలో చెల్లిస్తే 7శాతం రాయితీ వస్తుందన్నారు. మం చిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్, నస్పూర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు 7,324 మంది వీధి విక్రయదారులను గుర్తించడం జరిగిందని, వీరందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులైన విక్రయదారులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు.
Updated Date - 2020-08-09T07:14:39+05:30 IST