ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం
ABN, First Publish Date - 2020-03-16T12:16:28+05:30
బైంసా పట్టణ బస్టా ండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సుకు తృటిలో విద్యుత్ ప్రమాదం తప్పిం ది. నిర్మల్ డిపోకు చెందిన బస్సు...
భైంసా, మార్చి15: బైంసా పట్టణ బస్టా ండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సుకు తృటిలో విద్యుత్ ప్రమాదం తప్పిం ది. నిర్మల్ డిపోకు చెందిన బస్సు భైంసా వ స్తూ స్థానిక బస్టాండ్ మార్గంలో వెళ్తున్న కేబుల్ వైరుకు తగలడంతో ఘటన చోటుచే సుకుంది. వేలాడుతున్న కేబుల్ బస్సుకు తగ లడంతో తెగిపోయి బస్సుపై భాగంలో తట్టు కుపోయింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు కేబుల్వైర్ తగలడంతో మ ంటలు వచ్చాయు. బస్సు సమీపంలోని ఇత రులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆ పివేయగా భయాందోళనలతో ప్రయాణీకులు బస్సులో నుంచి వడివడిగా దిగి పక్కకు వెళ్లి పోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కా నిస్టేబుళ్లు కర్రలతో సాయంతో కేబుల్ వైర్, సపోర్టింగ్ వైరును తొలగించారు. దీంతో పె ను ప్రమాదం తప్పింది.
Updated Date - 2020-03-16T12:16:28+05:30 IST