ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగరంగ వైభవంగా రథోత్సవం

ABN, First Publish Date - 2020-12-06T06:54:52+05:30

మండల కేంద్రమైన జైనథ్‌లోని శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల చివరిరోజు శనివారం శ్రీమన్నారాయనుడు పెద్ద రథంపై మేళతాలాల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగారు. ఈ సందర్భంగా పెద్ద రథాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.

స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న, పాయల శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైనథ్‌లో ఘనంగా ముగిసిన శ్రీలక్ష్మినారాయణస్వామి బ్రహ్మోత్సవాలు 

హాజరైన ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్న

రాష్ట్ర నలుమూలలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చిన భక్తులు 

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

జైనథ్‌, డిసెంబరు 5: మండల కేంద్రమైన జైనథ్‌లోని శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల చివరిరోజు శనివారం శ్రీమన్నారాయనుడు పెద్ద రథంపై మేళతాలాల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగారు. ఈ సందర్భంగా పెద్ద రథాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. స్వామివారిని పట్టు వస్ర్తాలు, వెండి ఆభరణాలతో అలంకరించి ఆలయం చుట్టూ పల్లకీలో ఊరేగించి పెద్దరథంపై ప్రతిష్ఠించారు. రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు హాజరై తమ మొక్కుల ను తీర్చుకున్నారు. అంతకుమందు మహిళలు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావుతో పాటు ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీటీసీ అరుందతి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, ఆయా గ్రామాల భక్తులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising