మహిళను చితకబాది బంగారం చోరీ
ABN, First Publish Date - 2020-11-25T05:22:15+05:30
మండలంలోని తంతోలి గ్రామానికి చెందిన కుర్సంగే దుర్పతబాయి అనే మహిళ చేను పనులు నిమిత్తం పంట పొలానికి వెళ్లి పొలంలో పనులు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సైకిల్ పై వచ్చి ఒంటరిగా ఉన్న మహిళను చితకబాది చేవి పోగులు,కాలి మెట్టలు, పుస్తెలు ఎత్తుకెళ్లారు.
ఆదిలాబాద్రూరల్, నవంబరు 24: మండలంలోని తంతోలి గ్రామానికి చెందిన కుర్సంగే దుర్పతబాయి అనే మహిళ చేను పనులు నిమిత్తం పంట పొలానికి వెళ్లి పొలంలో పనులు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సైకిల్ పై వచ్చి ఒంటరిగా ఉన్న మహిళను చితకబాది చేవి పోగులు,కాలి మెట్టలు, పుస్తెలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆమెను చికిత్సనిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్థుతం ఆమెకు తలకు గాయాలు కావడంతో రిమ్స్లో చికిత్సపొందుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Updated Date - 2020-11-25T05:22:15+05:30 IST