ఇరువురి మధ్య గొడవ..తోపులాటలో ఒకరి మృతి
ABN, First Publish Date - 2020-12-05T06:39:43+05:30
ఇంటిస్థలం వద్ద ఉన్న రాళ్ల కుప్ప విషయంలో ఇరువురి మధ్య జరిగిన గొడవ తోపు లాటకు దారితీసి ఒకరి మృతి కి కారణమైంది.
దిలావర్పూర్, డిసెంబరు 4 : ఇంటిస్థలం వద్ద ఉన్న రాళ్ల కుప్ప విషయంలో ఇరువురి మధ్య జరిగిన గొడవ తోపు లాటకు దారితీసి ఒకరి మృతి కి కారణమైంది. వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా దిలా వర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో గోదల రఘు(26), రాచర్ల నడ్పి రాజేశ్వర్ ఇళ్లు పక్కనే ఉంటా యి. ఇరువురి ఇళ్ల స్థలాల మధ్య రాళ్లకుప్ప ఉంది. అయితే గురువారం రాత్రి 11:30లకు ఈ కుప్ప తొలగింపుపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు ఒకరినొకరు తోసుకున్నారు. గోదల రఘును రాజేశ్వర్ బలంగా తోసి వేయడంతో పక్కనే ఉన్న కర్రగుంజపై పడిన రఘు తలకు బలమైన గాయమై అక్కడి కక్కడే మృతి చెందాడు. కాగా మృతుని తల్లి లస్మవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మల్ డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, సీఐ వెంకటేష్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దిలావర్పూర్ ఎస్సై సంజీవ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-12-05T06:39:43+05:30 IST