దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపేందుకు కృషి
ABN, First Publish Date - 2020-12-16T05:02:27+05:30
దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపి క్రీడల్లో రాణించేలా తమవంతు కృషి చేస్తున్నామని మహిథ ఫౌండేషన్ కమ్యూని కేషన్ డైరెక్టర్ ఇందిరా పెనుబోలు అన్నారు. నవంబరు 19న శ్రీనగర్లో ప్రారంభించిన కశ్మీర్ టూ కన్యాకుమారి ఇన్ఫినిటి రైడ్ మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది.
ఆదిలాబాద్టౌన్, డిసెంబరు 15: దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపి క్రీడల్లో రాణించేలా తమవంతు కృషి చేస్తున్నామని మహిథ ఫౌండేషన్ కమ్యూని కేషన్ డైరెక్టర్ ఇందిరా పెనుబోలు అన్నారు. నవంబరు 19న శ్రీనగర్లో ప్రారంభించిన కశ్మీర్ టూ కన్యాకుమారి ఇన్ఫినిటి రైడ్ మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇందులో మొత్తం 30 మంది దివ్యాంగ ఫ్యారా అథ్లెట్స్ ఉన్నారు. ఈ సందర్భంగా ఇందిరా పెనుబోలు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అదే తరహాలో ఇండియాకు మెడల్ను సాధించేలా వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపేలా సైకిల్ యాత్రను నిర్వహిస్తు న్నామన్నారు. గతంలో జాతీయ స్థాయిలో మెడళ్లు సాధించారని తెలిపారు. ఈ నెల 31వరకు కన్యాకుమారి చేరుకుంటామని తెలిపారు.
Updated Date - 2020-12-16T05:02:27+05:30 IST