అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN, First Publish Date - 2020-07-04T10:32:17+05:30
డంపింగ్యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు.
కాసిపేట, జూలై 3 : డంపింగ్యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం సోమగూడెం, కాసిపేట, ముత్యంపల్లి, కోమటిచేను, పల్లంగూడ, కోనూరు పంచా యతీల్లో ఆమె పర్యటించారు. డంపింగ్యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ డంపింగ్యార్డులు లేకపో వడంతో కొన్ని పంచాయతీల్లో చెత్త రోడ్లపైకి చేరుతుందని, దీంతో ప్రజలు వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఈనెల 15లోగా డంపింగ్యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. కోమటిచేను పంచా యతీలో శ్మశాన వాటిక నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అధికారుల పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రతి పంచాయతీకి ఎకరం భూమిని కేటాయించాలని తహసీల్దార్ భూమేశ్వర్కు సూచించారు. హరి తహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో శ్రద్ధ వహించాలని సూచించారు. ఎంపీడీవో ఆలీం, ఎంపీవో మేఘమాల, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
Updated Date - 2020-07-04T10:32:17+05:30 IST