ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఒకరి పరిస్థితి సీరియస్... గాంధీకి తరలింపు
ABN, First Publish Date - 2020-04-01T18:36:09+05:30
ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితి సీరియస్గా మారడంతో ఇక్కడి అధికారులు ఆయనను..
ఆదిలాబాద్: ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితి సీరియస్గా మారడంతో ఇక్కడి అధికారులు ఆయనను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో నివసిస్తున్నాడు. ఈయన విషయం బయట అందరికీ తెలియడంతో ఆ వార్డు ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అలాగే సదరు వ్యక్తి ఇప్పటి వరకు ఎంతమందిని తాకి ఉంటాడనో, అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఏ మేరకు సమీపంగా వ్యవహరించి ఉంటాడనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు తరలించిన వ్యక్తి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం ఆందోళన కలిగించే అంశమేనంటున్నారు.
Updated Date - 2020-04-01T18:36:09+05:30 IST