అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ABN, First Publish Date - 2020-10-21T05:47:04+05:30
దొనబండ, పడ్తన్పల్లి గ్రామపంచాయతీలను మంగళవారం కేంద్ర బృందం సభ్యులు సునీల్, జస్టిస్ ప్రాతిస్లు సందర్శిం చారు.
హాజీపూర్, అక్టోబరు 20: దొనబండ, పడ్తన్పల్లి గ్రామపంచాయతీలను మంగళవారం కేంద్ర బృందం సభ్యులు సునీల్, జస్టిస్ ప్రాతిస్లు సందర్శిం చారు. ఉపాధిహామీ పనితీరు, అంగన్వాడీ కేంద్రాలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామపంచాయతీ రికార్డులు, ఉపాధిహామీ పనుల్లో కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. గ్రామాల్లో ని ర్మించిన కంపోస్ట్ షెడ్డులు, వైకుంఠధామాలు, హరితహారంలో నాటిన మొక్క లను, పల్లె ప్రకృతివనం, నర్సరీలను పరిశీలించి సిబ్బందిని ప్రశంసించారు. ఎంపీడీఓ మహ్మద్ అబ్దుల్హై, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, జిల్లా సహా యక సంచాలకులు మల్లేష్, ఏపీఓ మల్లయ్య, సర్పంచ్లు జాడి సత్యం, గొల్ల శ్రీనివాస్, ఎంపీటీసీ భాగ్యవ్వ, నోడల్ అధికారి సదానందం, ఈసీ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు జాదవ్మాధవ్, రాజమణిలు ఉన్నారు.
Updated Date - 2020-10-21T05:47:04+05:30 IST