ఇద్దరు మట్కా నిర్వాహకుల అరెస్టు
ABN, First Publish Date - 2020-12-11T05:45:05+05:30
పట్టణంలో మట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల నిఘా కొనసాగుతోంది. గురువారం టాస్క్ఫోర్స్ పోలీసుల కు అందిన సమాచారం మేరకు సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో మావల ఎస్సై డి.రమేష్తో భగత్సింగ్నగర్ కాలనీ శివారు ప్రాంతంలో మట్కా స్థా వరాలపై దాడులు చేశారు.
ఆదిలాబాద్టౌన్, డిసెంబరు10: పట్టణంలో మట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల నిఘా కొనసాగుతోంది. గురువారం టాస్క్ఫోర్స్ పోలీసుల కు అందిన సమాచారం మేరకు సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో మావల ఎస్సై డి.రమేష్తో భగత్సింగ్నగర్ కాలనీ శివారు ప్రాంతంలో మట్కా స్థా వరాలపై దాడులు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జువినే విజయ్ ఆనంద్, సోలంకి అనిల్ లు కలిసి మట్కా జూదం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి వారి నుంచి నగదు రూ.2500 మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను మావల పోలీసుస్టేషన్కు తరలించి కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Updated Date - 2020-12-11T05:45:05+05:30 IST