రైతులకు నష్టం కలగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2020-05-28T22:52:45+05:30
రైతులకు నష్టం కలగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: సీఎం కేసీఆర్
హైదరాబాద్: పంట పొలాల్లో మిడతల దాడిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతులకు నష్టం కలగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అటవీ, వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం పంటలు లేవని, మిడతల దండు దాడి ఇప్పట్లో ఉండకపోవచ్చని అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు. మిడతల ఎప్పుడు రాష్ట్రానికి వచ్చే అవకాశముందో అంచనా వేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
Updated Date - 2020-05-28T22:52:45+05:30 IST