బీజేపీ మోర్చా అధ్యక్షుల బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2020-08-15T10:24:02+05:30
బీజేపీ మోర్చాల అధ్యక్షులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): బీజేపీ మోర్చాల అధ్యక్షులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆలె భాస్కర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కొప్పు బాషా బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీ్పకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-15T10:24:02+05:30 IST