ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ : నీటి గుంతలో పడి బాలుడు మృతి

ABN, First Publish Date - 2020-10-18T23:08:48+05:30

హైదరాబాద్ : నీటి గుంతలో పడి బాలుడు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 5లోని దుర్గాభవాని నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం గుంతలో పడి మూడేళ్ల బాలుడు సిద్ధు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్తూ బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారణమైన భవనం పరుచూరి రవీంద్రనాథ్‌కు చెందిన భవనంగా గుర్తించారు.


న్యాయం చేయాలంటూ మృతదేహంతో స్థానికులు భవనం ముందు ఆందోళనకు దిగారు. భవనం వద్ద భారీ గుంత ఉండడం వల్ల తమ బిడ్డ ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడి చనిపోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-10-18T23:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising